సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంట త్రీవ విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య రూహీ కన్నుమూసింది. యోగా టీచర్గా పని చేస్తున్న ఆమె అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో సెంథిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మరణవార్త చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. రూహీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సెంథిల్ కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నారు. రూహి మరణవార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
సెంథిల్ కుమార్, రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. COVID-19 నుండి రూహీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అప్పటినుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆమె ఆరోగ్యం విషమించడం తో తుది శ్వాస విడిచారు. రేపు( శుక్రవారం) ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఇక సినిమాటోగ్రాఫర్గా సెంథిల్ల్కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన కుటుంబానికి సెంథిల్ చాలా దగ్గర అయ్యారు.