జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయిః సిఎం జగన్‌

jagan

అమరావతిః గుంటూరు జిల్లా ఫిరంగీపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన సిఎం జగన్‌ మాట్లాడుతూ..వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారు తెలిపారు. లంచంలేని వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల లక్ష్యం అని తెలిపారు. జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. టిడిపిని అధికారంలోకి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణం అని తెలిపారు సీఎం జగన్.

గత పాలనకు, మన పాలనకు ఒక్కసారి తేడా గమనించండి. ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామని తెలిపారు. 2లక్షల 60వేల వాలంటీర్లు నా సైన్యం అని తెలిపారు. మనం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల రూపు రేఖలనే మార్చేశాయని తెలిపారు. ఆర్భీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా నిలబడుతుందని సీఎం జగన్ తెలిపారు. మరో రెండు నెలల్లో జరుగబోయే యుద్ధానికి సిద్ధమా అని జగన్ ప్రశ్నించారు.