బీఆర్ఎస్ లో చేరిన ఏనుగుల రాకేశ్ రెడ్డి
బిజెపి టికెట్ రాలేదని భంగపడ్డ ఏనుగుల రాకేష్ రెడ్డి..బిజెపి కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని తెలిపిన రాకేష్ ..నేడు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. రాకేష్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్.. భవిష్యత్ తెలంగాణ నిర్మాత కేటీఆర్ అన్నారు.
ఇక రాకేష్ బిఆర్ఎస్ లో చేరేందుకు కడియం శ్రీహరి మంతనాలు జరుపగా..ఆయన మంతనాలు సక్సెస్ అయ్యాయి. రాకేష్ రెడ్డి ఇంటికెళ్లిన కడియం శ్రీహరి తమ పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో ఆయనకు ఈరోజు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి, జనగాం అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో పాటు పలువరు నాయకులు పాల్గొన్నారు.