ఈ నెల 07 న బీసీలంత కదలి రావాలని పిలుపునిచ్చిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

ఈ నెల 07 న హైదరాబాద్ లో బిజెపి తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించబోతుంది. ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. యావత్ బీసీలంతాసభకు హాజరుకావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీజేపీ ప్రకటనతో బీసీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీసీలు రెడీగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. బీసీల చిరకాల వాంఛ ముఖ్యమంత్రి పదవి.

కాంగ్రెస్ బీసీ సీఎం నినాదాన్ని జీర్ణించుకోలేక పోతుందని, రాహుల్ బీసీలను అవహేళన చేస్తూ మాట్లాడారన్నారు. దీన్ని సవాలుగా తీసుకొని ముందుకి వెళ్తున్న బీసీలు.. ఈ సభకు బీసీలంత కదలి విజయవంతం చేయాలని ఆయన కోరారు. కేసీఆర్, రాహూల్ గాంధీకి తెలంగాణలో బీసీ సీఎంను చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా? అని ఆయన సవాల్‌ విసిరారు. కేసీఆర్ పదవుల్లో సామాజికత పాటించలేదని, బీజేపీ ప్రకటించిన 88 మందిలో అభ్యర్థుల్లో 31 మంది బీసీలు ఉన్నారన్నారు. బీసీ నేతలకు ఢిల్లీలో అపాయిన్మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ బీసీలను అవమాన పరిచిందన్నారు లక్ష్మణ్‌. నామినేట్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని, సీఎం అయ్యే సామర్థ్యం బీసీ లకు లేదా? అని ఆయన అన్నారు. కేటీఆర్ నీ గుణం ఇంత? నీ కులం ఎంత? తండ్రీ చెప్పుకునే నీవా బీసీల గురించి మాట్లాడేది? అని ఆయన మండిపడ్డారు. మీ నాన్న పేరు లేకుంటే వార్డ్ మెంబర్ అయిన గెలవగలవా? అని ఆయన ప్రశ్నించారు.