పదవుల కోసమో.. అధికారం కోసమే బీఆర్ఎస్‌లో చేరలేదు – పొన్నాల

కాంగ్రెస్ పార్టీ లో దశాబ్ద కాలాలు పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య..రీసెంట్ గా ఆ పార్టీ కి రాజీనామా చేసి , కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పొన్నాల పార్టీ ని వీడడం ఫై కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేసారు. తాను పదవుల కోసమో… అధికారం కోసమో… కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరలేదని, కేవలం ఆత్మగౌరవం కోసం మాత్రమే బిఆర్ఎస్ లో చేరినట్లు పొన్నాల క్లారిటీ ఇచ్చారు.

జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదని, అవగాహన లేదని, ఆలోచన లేదన్నారు. అహంకారంతో చేసే పని వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితమయిందన్నారు. తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తోందన్నారు. కేసీఆర్ రావడం అవసరం, అవశ్యకత ఉందన్నారు. ఇంకెప్పుడూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆలోచన తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీది స్వయంకృపరాధమే అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దూరమైందన్నారు.