ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

ias
ias

అమరావతిః ఏపిలో ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కృష్ణా, గోదావరి కాలువల పారిశుద్ధ్య మిషన్‌కు కమిషనర్‌గా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ కాటమనేని భాస్కర్‌ను పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్‌ గా బదిలీ చేశారు. సాంకేతిక విద్య శాఖ డైరెక్టరుగా నాగరాణిని, జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎంఎం. నాయక్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి సాంఘీక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టరుగా శ్రీనివాసరావుకు బాధ్యతల అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/