ఎమ్మెల్యే రఘునందన్ సవాల్ : ఛార్మినార్‌ నుంచి గెలిచి చూపిస్తా

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో చార్మినార్ నుండి పోటీ చేసి గెలిచి చూపిస్తా అని సవాల్ విసిరారు. నల్లగొండ నియోజకవర్గంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజాగోస బిజెపి భరోసా’ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సభలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. సిరిసిల్లలో 2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన మంత్రి కేటీఆర్, 1500 ఓట్లతో గెలిచిన తనను అవహేళన చేస్తున్నాడని, తాను రాబోయే ఎన్నికల్లో చార్మినార్ లో కూడా గెలిచి చూపిస్తానని .. కేసిఆర్ బొమ్మ లేకుండా కేటీఆర్ సిరిసిల్ల వదిలి వేరే చోట గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. లిక్కర్ స్కాం లో ఇరుక్కుపోయిన కవిత నీతులు చెప్పడం దారుణంగా ఉందన్నారు.

ప్రస్తుతం తెలంగాణ లో బిజెపి vs బిఆర్ఎస్ (టిఆర్ఎస్) గా మారిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బిజెపి పట్టుదలతో ఉంది. ఇదే క్రమంలో మరోసారి తెలంగాణ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి – టిఆర్ఎస్ నువ్వా- నేనే అన్నట్లు సాగింది. చివరి వరకు ఫలితాలు టెన్షన్ రేపాయి. కానీ చివరికి అధికార పార్టీ అభ్యర్థి గెలిచాడు.