మరోసారి పురంధేశ్వరి వివాదాస్పద వ్యాఖ్యలు

purandeswari

అమరావతిః బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కడప విమానానికి ఫుల్ ఆక్యుపెన్సీ ఉందంటే అనుమానాలు కలుగుతున్నాయని..విశాఖలో భూముల దోపిడీ కోసం వాళ్ళంతా ఇక్కడకు వస్తున్నట్టు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు కోసం కేంద్రంపై అబండాలు వేస్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ ఎప్పుడు సమర్పించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వున్నది స్టిక్కర్ ప్రభుత్వమని మండిపడ్డారు. టిడ్కొ ఇళ్లను కూడా కేటాయించలేని దయనీయ స్థితిలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే పేదలను వంచించడమేనన్నారు. టిడ్కొ ఇళ్లను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని..తీసుకున్న అప్పుకు లబ్దిదారులకు ఇప్పుడు నోటీసులు వస్తున్నాయని ఆరోపణలు చేశారు. ఇన్ఫోసిస్ కు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం ఏమీ లేదు వచ్చిన ఐటీ కంపెనీలను వెళ్ళ గొట్టారని మండిపడ్డారు