33 జిల్లా కోర్టుల్లో బిజెపి నేతలపై కవిత పరువునష్టం దావా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉందన్న బిజెపి ఎంపీ, మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తన తండ్రి కెసిఆర్ ను బద్నాం చేయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వీరిపై పరువునష్టం దావా వేస్తానని నిన్న ప్రకటించారు. చెప్పిన విధంగానే వీరిపై ఆమె పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టులలో ఆమె పరువునష్టం దావా వేశారు. మరోవైపు నిన్న కవిత ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టిన 29 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ నరేందర్ తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/