వైస్సార్సీపీ లో చేరిన జనసేన కీలక నేత

మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్‌ సుధీర్‌ నేడు తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈయన తో పాటు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్‌లు వైసీపీలో చేరారు. పార్టీ లో చేరిన వీరిందరికి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్‌ పాల్గొన్నారు.

జనసేన విధానాలు నచ్చక ఎడ్లపల్లి రాం సుధీర్ వైసీపీలో చేరారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జగన్ పాలన మెచ్చి కలసి పని చేయాలని పార్టీలో చేరారని.. ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరేనన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని.. చంద్రబాబుకు తాబేదారుగా ఉంటూ మోస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని చంద్రబాబుకు మద్దతు ఇవ్వొద్దని జనసేన నేతలను కోరుతున్నామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.