బిగ్ బాస్ విన్నర్ ఫై కేసు నమోదు

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం అట్టహాసంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంతే అవుతాడని అంత ఊహించారు. అదే విధంగా ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇక ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ పోటీ పడగా వారిలో చివరికి పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. దీంతో తన రెమ్యునరేషన్ తో పాటు 35 లక్షల క్యాష్, 15 లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్, ఒక విటారా బ్రీజా కారుతో పాటు మరో 15 లక్షల విలువ చేసే ఓపెన్ ప్లాట్ కూడా ఇవ్వనున్నారు.

ఇదిలా ఉంటె టైటిల్ గెలుచుకొని బయటకు వచ్చిన ప్రశాంత్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదే క్రమంలో కొంతమంది ఆకతాయిలు పలు కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల ఫై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు. ఆరు బస్సులు, ఓ పోలీస్‌ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ఫ్యాన్స్ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. సీసీఫుటేజీ, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించామని ఈ దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇది ఈ ఘటనపై పోలీసుల విచారణ మొదలు పెట్టి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద ఫైల్ చేశారు.