బైజూస్ ఫై ఏపీ ప్రభుత్వానికి పవన్ సూటి ప్రశ్నలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైస్సార్సీపీ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఫై పలు ఆరోపణలు చేసిన పవన్..ఇప్పుడు బైజూస్ ఫై ఏపీ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేస్తున్నారు. బైజూస్ తో ఒప్పందంపై కీలక విషయాలు ప్రస్తావిస్తూనే, విలువైన ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.

బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించి కొన్ని విషయాలు నోట్ చేసుకోవాలంటూ కీలక అంశాలు లెవనెత్తారు.

  1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది.
  2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి విద్యార్ధులకు ఉచితంగా కంటెంట్ లోడ్ చేసి ఇస్తామని ఒప్పుకున్నారు.
  3. వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం 580 కోట్ల ఖర్చుతో 5 లక్షల ట్యాబ్లెట్లు కొననుందా? అని కీలక అంశాలు లెవనెత్తుతూ పవన్ ట్వీట్ చేశారు.

ప్రశ్నించదగిన అంశాలు అంటూ మరిన్ని అంశాలను పవన్ ప్రస్తావించారు.

  1. బైజూస్ కంటెంట్ కోసం వచ్చే సంవత్సరం నుండి ఖర్చు ఎవరు చెల్లిస్తారు? కంపెనీ వారు ప్రతీ సంవత్సరం ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించిందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్ వారు కంటెంట్ లోడ్ చేసిన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ బైజూస్ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పలేదని అన్నారు.
  2. ఒకవేళ కంపెనీ వారు ఖర్చు భరించకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? AP ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో 750 కోట్లు బైజూస్ కంటెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది (ఒక్కో విద్యార్థికి 15 వేల చొప్పున * 5 లక్షల విద్యార్థులు = 750 కోట్లు). క్లారిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
  3. 8వ తరగతి నుండి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్ ఖర్చు ఎవరు భరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
  4. బైజూస్ సంస్థ వారు ఏ మాధ్యమంలో, ఏ సిలబస్ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్ రూపొందిస్తున్నారు? CBSC/స్టేట్ సిలబస్ లేదా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్నారా? దీనికి జవాబు: CBSE సిలబస్ ఆధారంగా కంటెంట్ రూపొందించాం అని సంస్థ వారు పేర్కొన్నారని తన ట్వీట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.