జేపీ నడ్డాతో సమావేశమైన పవన్ కల్యాణ్
న్యూఢిల్లీః బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. ఏపీ తాజా రాజకీయ పరిస్థితులు, బిజెపి రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికల సమాయత్తం తదితర అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా జేపీ నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.