జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరుః జోగి రమేశ్

చంద్రబాబు ముసలి నక్క, పవన్ పిచ్చి కుక్క అన్న జోగి రమేశ్

pawan-kalyan-changed-not-only-wise-but-also-parties-says-jogi-ramesh

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముసలి నక్క, పవన్ కల్యాణ్ ను పిచ్చి కుక్క అని అన్నారు. పవన్ పెళ్లాలనే కాకుండా పార్టీలను కూడా మారుస్తాడని విమర్శించారు. మార్చడం, తార్చడం వంటివి పవన్ కు అలవాటేనని చెప్పారు. ఊరపంది తిరిగినట్టు ఒకడు రోడ్లపై తీరుగుతున్నాడని లోకేశ్ ను ఉద్దేశించి అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ పేదలకు అన్నం పెడుతున్నారని, గూడు కల్పిస్తున్నారని జోగి రమేశ్ చెప్పారు. జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరని అన్నారు. అమరావతిలో 50 వేల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారని చెప్పారు. పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.