‘రంగరంగ వైభవంగా’ ట్రైలర్ రిలీజ్..

ఉప్పెన తో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ లోకి మెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత కొండపోలం మూవీ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మూడో చిత్రం రంగరంగ వైభవంగా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అర్జున్‌ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గిరీశయ్య రంగరంగ మూవీకి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు.

ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు. `నువ్వొచ్చి మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడను అని అమ్మాయి అంటే.. నువ్వోచ్చి నాతో మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడను అంటూ చిన్ననాటి హీరో హీరోయిన్ లు సవాల్ చేసుకునే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది. పెద్దయ్యాక కూడా ఇదే ఈగో ఇద్దరి మధ్య గొనసాగడం చూపించారు.

ఎవడి బండి వాడే తుడుచుకోవాలి… ఎవడి లిఫ్ట్ వాడే అడుక్కోవాలి… అంటూ పంజా వైష్ణవ్ తేజ్ చెబుతున్న డైలాగ్ లు.. ఇవ్వే తగ్గించుకుంటే బాగుంటది.. అంటూ మరో డైలాగ్.. ఇలా ఇద్దను ఈగో యిస్టుల ఎలా ప్రేమలో పడ్డారు? .. ఆతరువాత ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి సంఘనలు చోటు చేసుకున్నాయి అనేది సినిమా గా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సెప్టెంబర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.

YouTube video