గాంధీభవన్‌లో రేపు పీఏసీ సమావేశం

తెలంగాణ లో అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి గాంధీ భవన్ లో పీఏసీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అలాగే పార్టీ బలోపేతం, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ పథకాల అమలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా పథకాల అమలు, వాటి ప్రయోజనాలు ప్రజలకు చేరేలా పార్టీ నాయకులను సమాయత్తం చేయడం వంటి తదితర అంశాల గురించి చర్చించబోతున్నారు.