సిద్దిపేట జిల్లా ఘోర బస్సు ప్రమాదం తప్పింది..

సిద్దిపేట జిల్లా నకిరి కొమ్ముల గ్రామంలో నడి రోడ్డు పై హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న హుస్నాబాద్ డిపోకు చెందిన మినీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ముందు టైర్ ఉడిపోయి పక్కకు ఒరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తం కావడం తో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 12 మంది ఉన్నారు. ఆ 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడేలా చేసాడు.

బస్సు టైర్ ఊడిపోయి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వెళ్ళింది. బస్సు డిపోలో ఉన్న సమయంలోనే అన్ని సరిచూసుకోవాల్సిన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. ఒకవేళ బస్సులో మహిళలు అధికంగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.