మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..వరుసగా అన్ని శాఖల్లో బదిలీల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు IPS లను బదిలీ చేయగా..తాజాగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈసీ సూచనలతో 74 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకుముందు 40 మందిని ట్రాన్స్ఫర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం 105 మంది పంచాయతీ రాజ్ సిబ్బందిని సైతం ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. బదిలీ చేసిన అధికారులను రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.