గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించిన లోకేష్

వైస్సార్సీపీ పార్టీ నుండి టిడిపి లో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు కీలక బాధ్యత అప్పగించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్రలో బిజీ గా ఉన్నారు. నేడు గన్నవరం నియోజకవర్గం నుండి పాదయాత్ర మొదలుపెట్టారు. నిన్న గన్నవరం లో భారీ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు నుంచి ప్రారంభమైంది.

ఈ సందర్భంగా యువనేత నారా లోకేశ్‌కు జనం అడుగడుగునా బ్రహ్మరథంపట్టారు. కన్వెన్షన్ హాలు నుంచి ప్రారంభమైన యాత్ర.. చినఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు మీదుగా అంపాపురం శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటిస్తున్నాని లోకేశ్ పేర్కొన్నారు. పిల్లసైకో వంశీని, సన్నబియ్యం సన్నాసి వంశీని ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ హాలులో పలువురు వైసీపీనేతలు, వారి అనుచరులతో కలిసి యువనేత లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు.