వైఎస్ఆర్సిపి తీర్ధం పుచ్చుకోనున్న కేశినేని నాని ?
అమరావతిః వైఎస్ఆర్సిపిలో చేరేందుకు ఎంపీ కేశినేని నాని రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే.. నేడు సీఎం జగన్ ను కేశినేని నాని కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బెజవాడ ఎంపీ సీటు కేశినేనికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నానితో పలుమార్లు వైఎస్ఆర్సిపి కీలక నేతలు సమావేశమైయ్యారట. ఇప్పటికే బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న పలువురు వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎంఎల్ఏ లతో కేశినేని నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే… వైఎస్ఆర్సిపిలో చేరేందుకు ఎంపీ కేశినేని నాని రంగం సిద్దం చేసుకున్నారని సమాచారం అందుతోంది. కాగా ఇటీవలే తెలుగు దేశం పార్టీకి ఎంపీ కేశినేని నాని రాజీనామా చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబు పార్టీకి దూరంగా ఉండాలని చెప్పాడని.. అందుకే రాజీనామా చేసినట్లు తెలిపారు ఎంపీ కేశినేని నాని. అటు ఎంపీ కేశినేని నాని కూతురు కూడా రాజీనామా చేశారు.