అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

earthquake

న్యూఢిల్లీః అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాది వేళ జపాన్‌ను వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు.