మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి రాహుల్‌ గాంధీ నివాళి

Rahul Gandhi Pays Tributes At The Memorial Of Former Prime Minister Atal Bihari Vajpayee

న్యూఢిల్లీః కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటుగా పులువురు ప్రముఖులకు నివాళులర్పించారు. సదైవ్ అటల్ లోని వాజ్ పేయి సమాధి వద్ద పూలమాల ఉంచి రాహుల్ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్ర ఢిల్లీలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని మహాత్మా గాంధీ, మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల స్మారక చిహ్నాల వద్ద రాహుల్ నివాళులర్పించారు. రాహూల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యాత్ర న్యూఢిల్లీలో కొనసాగుతున్నది. ప్రస్తుతం ఆయన విరామంలో ఉన్నారు. వచ్చే నెల 3న యాత్ర తిరిగి ప్రారంభం కానున్నది.

కాగా, భారత్‌ జోడో యాత్ర చేపట్టిన రాహుల్‌ గాంధీ.. కన్యాకుమారి నుంచి జమ్మకశ్మీర్‌లో ముగిసేవరకు 3570 కిలోమీటర్ల ప్రయాణించనున్నారు. ఇందులో భాగంగా ఆయన 12 రాష్ట్రాల మీదుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 వేల కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నది. అనంతరం ఉత్తరప్రదేశ్‌ మీదుగా యాత్రను కశ్మీర్‌ వరకు యాత్రను రాహుల్‌ కొనసాగించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/