పవన్ కల్యాణ్తో ఎంపీ వల్లభనేని బాలశౌరి
ఇటీవల వైఎస్ఆర్సిపికి రాజీనామా
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/01/mp-balashowry-meets-pawan-kalyan-jpg.webp)
హైదరాబాద్ః జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ నివాసానికి ఆయన వెళ్లారు. 2019లో వైఎస్ఆర్సిపి తరపున బాలశౌరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఇటీవల వైఎస్ఆర్సిపికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రోజే తాను జనసేనలో చేరబోతున్నట్టు ఆయన ప్రకటించారు. వైఎస్ఆర్సిపి నేతలు పేర్ని నాని, జోగి రమేశ్ లతో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. మరోవైపు, జనసేనలో చేరిక, ఇతర రాజకీయ అంశాలపై పవన్ తో బాలశౌరి చర్చించనున్నారు.