దేశంలో కొత్తగా 15,754 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు పెరుగుతునే ఉన్నాయి. మంగళవారం 8 వేలకు తగ్గిన రోజువారీ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గురువారం 12 వేల మందికిపైగా కరోనా నిర్ధారణకాగా, నేడు ఆసంఖ్య 15,754కు చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి పెరిగింది. ఇందులో 4,36,85,535 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,253 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,01,830 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కాగా, గత 24 గంటల్లో 47 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందగా, 15,220 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంనిణీ చేశామని ప్రకటించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/