బంగ్లాదేశ్ లో 2రోజుల పర్యటన
జాతీయ దినోత్సవాలకు హాజరు కానున్న ప్రధాని మోడీ
![Modi 2-days visit to Bangladesh](https://www.vaartha.com/wp-content/uploads/2021/03/Modi-2-days-visit-to-Bangladesh-1024x583.jpg)
New Delhi: ప్రధాని మోడీ శుక్ర, శని వారాల్లో బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. ఉదయం 7.45 గంటలకు బంగ్లాకు బయలుదేరి 10గంటలకు ఢాకా చేరుకుంటారు. 10.50 గంటలకు జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, నివాళులర్పించనున్నారు. అనంతరం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత 3:45 గంటలకు జాతీయ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రి 7:45 గంటలకు బాపు .. బంగబందు డిజిటల్ వీడియో ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/