ఉద్దేశ పూర్వకంగానే వినుకొండలో టిడిపి శ్రేణులపై దాడులుః జీవీ ఆంజనేయులు
తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే దాడులు జరిగాయి
అమరావతిః వినుకొండలో నిన్న టిడిపి, వైఎస్ఆర్సిపి శ్రేణల మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. తనను చంపేసి వినుకొండలో గెలవాలని టిడిపి భావిస్తోందని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత స్పందస్తూ… ఉద్దేశ పూర్వకంగానే వినుకొండలో టిడిపి శ్రేణులపై దాడులు చేశారని చెప్పారు. తాడేపపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతోనే దాడులు జరిగాయని మండిపడ్డారు. పల్నాడులో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
స్థానిక పోలీసులే కర్రలు ఇచ్చి దాడులకు సహకరించారని చెప్పారు. అవసరం లేకుండానే సీఐ ఫైరింగ్ చేశారని… ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాచర్ల నుంచి వచ్చిన వైఎస్ఆర్సిపి నేతలు వినుకొండలో హల్ చల్ చేస్తే… వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బొల్లా బ్రహ్మనాయుడు నిజ స్వరూపం ఏమిటనేది నిన్న బయటపడిందని… ఇక నుంచి ఆయన గుడ్డలూడదీసి రోడ్డుపై నిలబెడతామని చెప్పారు.