మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఏఎస్ఐ ఫజల్ అలీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తె సమక్షంలో గన్తో కాల్చుకుని కుప్పకూలిపోయారు. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎస్కార్ట్ అధికారిగా ఉన్న ఏఎస్ఐ ఫాజిల్ అలీ ఎప్పటిలానే ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చాడు. మార్గమద్యలో శ్రీనగర్ కాలనీలోని మణికొండ టిఫిన్ సెంటర్కు చేరుకున్నాడు. కూతురు, కుమార్తెను పిలిపించుకుని మాట్లాడుతున్నారని తెలిసింది. పిల్లలతో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా గన్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్లో నుదుట కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని ప్రాధమికంగా పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ నుంచి తీసుకున్న రుణానికి 3 లక్షలు చెల్లించేసినా ఇంకా 10 లక్షలు చెల్లించాలని వేధిస్తున్నట్టు సమాచారం అందింది. అందుకే ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. అతని కుటుంబ సభ్యలు ఈ ఘటనపై కేసులు పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని ‘ డీసీపీ జోయేల్ డేవిస్ తెలిపారు.