జర్మనీ లోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌ లో కాల్పులు

జర్మనీ లోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌ లో కాల్పుల ఘటన ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేసింది. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ లకి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు చేసారు. కారులో దుండగుడితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దుండగుడు చేసిన కాల్పుల వల్ల శనివారం నాడు ఎలాంటి విమాన సర్వీసులు ఉండవని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. దీంతో విమానాలు అన్ని కూడా ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన వల్ల సుమారు 27 విమాన సర్వీసులను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి రెండు గాజు సీసాలకు నిప్పు పెట్టి విమానాశ్రయంలోనికి విసిరినట్లు పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయంలోని కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.