జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తాం..కెటిఆర్
హైదరాబాద్ః సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రాష్ట్ర మంత్రి కెటిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసును క్లియర్ చేసినందుకు సీజేఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కెటిఆర్ ట్వీట్ చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ తీర్పు తోడ్పడుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల, పాత్రికేయ మిత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వీలు కలుగుతుందని కెటిఆర్ పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/