బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తో అయోమయంలో వామపక్షాలు

CM KCR Announces BRS Candidates List

సోమవారం బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్..ఎన్నికల బరిలో నిల్చుబోయే అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 115 మంది తో కూడిన లిస్ట్ ను ప్రకటించారు. ఈసారి సింగిల్ గా బరిలోకి దిగబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడం తో వామపక్షాలు అయోమయంలో పడ్డాయి.

మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు బిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశాయి. అప్పటి నుంచి BRS, వామపక్షాల మధ్య మైత్రి ప్రారంభమైంది. కానీ కేసీఆర్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడంతో వామపక్షాలు షాక్ తిన్నారు. సీపీఐ, సీపీఎంలు మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లో ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించాయి.