వైద్య పరీక్షలు చేసుకున్న ఏపీ సీఎం జగన్

cm-jagan

ఏపీ సీఎం జగన్ గత కొద్దీ రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నొప్పి ఎక్కువ కావడం తో సోమవారం వైద్య పరీక్షలు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విజయవాడలోని మొగల్రాజపురంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లారు. ఎమ్మారై స్కాన్‌తో పాటూ ఆయన వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ల్యాబ్‌లో ఆయన సుమారు రెండు గంటలపాటు ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా జగన్ వెంట ఆయన భార్య భారతి రెడ్డి కూడా ఉన్నారు. పరీక్షల అనంతరం జగన్ మూడు గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. జగన్ నొప్పితో బాధపడుతున్నాడని తెలిసి పార్టీ శ్రేణులు ఆయన ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు.