దేశంలో కొత్తగా 45,892 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557
మొత్తం మృతుల సంఖ్య 4,05,028
న్యూఢిల్లీ : దేశం లో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 44,291 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,09,557కు చేరింది.
మరణాల విషయానికొస్తే, నిన్న 817 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,05,028కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,98,43,825 మంది కోలుకున్నారు. 4,60,704 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. మొత్తం 36,48,47,549 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 33,81,671 డోసులు వేశారు. కరోనా కేసుల రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/