వర్మ పెద్ద మోసగాడు అంటూ కోర్ట్ లో కేసు వేసిన నిర్మాత నట్టికుమార్

రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడు..తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలి.. ఎప్పుడు డబ్బులు అడిగిన రెస్పాన్స్ లేదని నట్టికుమార్ ఆరోపిస్తూ కోర్ట్ లో కేసు వేసాడు. ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను తుంగలో తొక్కాడని ఆరోపించారు. వర్మ తో 20 సంవత్సరాలు కలిసి పని చేసాను… కొంతమంది బ్రోకర్ల వలన రామ్ గోపాల్ వర్మ తన ప్రతిష్టను దిగజరుచుకుంటున్నాడని నట్టికుమార్ అన్నారు. నన్ను ఒక్కడినే కాకుండా చాలామందిని మోసం చేసాడు.

సాయంత్రం 5 గంటల కు రామ్ గోపాల్ వర్మ బండారం బయటపెడుతానని హెచ్చరించారు. నట్టి కుమార్ వేసిన కేసును విచారించిన సిటీ సివిల్‌ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తీసిన డేంజరస్ సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. డేంజరస్ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో నట్టి కుమార్ కేసు వేయడం..కోర్ట్ సినిమా రిలీజ్ ను ఆపేస్తు తీర్పు ఇవ్వడం వర్మ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి 5 గంటలకు నట్టికుమార్ వర్మ గురించి ఎలాంటి నిజాలు బయటపెడతాడో చూడాలి.