సుప్రీంకోర్టులో కరోనా కలవరం..కోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు
న్యూఢిల్లీః సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. పలువురు లాయర్లు, న్యాయవాదులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో సుప్రీంకోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అందరూ మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం లో కరోనా కలకలం రేగింది.