బాక్స్ ఆఫీస్ వద్ద విరూపాక్ష కలెక్షన్ల ఊచకోత

సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. తేజ్ – కార్తీక్ దండు కలయికలో తెరకెక్కిన మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు చేశారు. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. టాక్ బాగుండడం తో రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం భారీ వసూళ్లు రాబట్టింది.

మూడో రోజు కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 2.68 కోట్లు
సీడెడ్‌లో రూ. 88 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు
ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు
వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు
గుంటూరులో రూ. 38 లక్షలు
కృష్ణాలో రూ. 40 లక్షలు
నెల్లూరులో రూ. 16 లక్షలతో కలిపి.. రూ. 5.77 కోట్లు షేర్, రూ. 9.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇక మూడు రోజులకు కలిపి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.36 కోట్లు , కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.41 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.05 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ. 20.82 కోట్లు షేర్‌, రూ. 37.00 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.