ప్రధాని మోదీ నేతృత్వంలో కీలక భేటీ
లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కీలక చర్చలు
న్యూఢిల్లీ : కరోనా లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కరోనా పై కీలక సమావేశం ప్రారంభమైంది. అయితే, దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. లాక్డౌన్ ఎత్తివేయాలని లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లడమే కాకుండా పేదలు ఆకలితో మరణిస్తారంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలు చేస్తోన్న వేళ.. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్డౌన్ ఎత్తివేత లేక కొనసాగింపు, సడలింపులు, తదుపరి కార్యాచరణపై మోదీ కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంపై మోదీ నిర్ణయం తీసుకుని ఈ రోజు లేదా రేపు కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి :
https://www.vaartha.com/andhra-pradesh/