టిడిపి మరోసారి అసత్య ప్రచారానికి దిగింది

చంద్రబాబు ఉత్తరాంధ్రకు వచ్చే ముందు ప్రజలను కించపరిచేలా మాట్లాడారు

koyya prasad reddy
koyya prasad reddy

విశాఖపట్టణం: విశాఖ వేదికగా టిడిపి మరోసారి అసత్య ప్రచారానికి దిగిందని ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత కొయ్య ప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చే ముందే ప్రజలను కించపరిచేలా మాట్లాడారని పేర్కొన్నారు. దీంతో ఆందోళన తెలిపేందుకు ప్రజలు విమానాశ్రయానికి చేరుకోగా.. వారిని టిడిపి నేతలు.. పులివెందుల, కడప నుంచి వచ్చారని, పెయిడ్‌ ఆర్టిస్టులని అనడంతో ఉద్రికత్త తలెత్తిందన్నారు. సతీసమేతంగా బంధువుల పెళ్లికి వచ్చిన చంద్రబాబు ఈ రాజకీయ డ్రామా చేయడం ఏమిటని? ఇది ప్రజలను రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు. విశాఖకు రాజధాని వద్దన్న ఆయనకు ప్రజల మద్దతు ఏమాత్రం లభించలేదన్నారు. కనీసం ఎయిర్‌పోర్టుకు ప్రాతినిధ్యం వహించే గణబాబు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. చంద్రబాబు దగ్గరికి రాలేదని ఎద్దేవా చేశారు. అక్కడ పట్టుమని వందమంది కార్యకర్తలు కూడా లేరని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/