కేరళ గవర్నర్కు కరోనా పాజిటివ్
తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన
తిరువనంతపురం: కేరళ గవర్నర్ మహమ్మద్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. తనకు కరోనా కరోనా పాజిటి అని తేలిందని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గవర్నర్ తెలిపారని రాజ్భవన్ పీఆర్వో వెల్లడించారు. కాగా, గతవారం న్యూఢిల్లీలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని లేదా ముందుజాగ్రతలో భాగంగా పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/