మోడీ కి ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు లేఖ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..ప్రధాని మోడీకి ధన్యవాదాలు లేఖ రాసారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రత్యేక నాణెం విడుదల చేస్తుండడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ మోడీకి లేఖ రాసారు. మంగళవారం హైదరాబాద్ లోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడంపై టీడీపీ పొలిట్ బ్యూరో హర్షం వ్యక్తం చేసింది. నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి , ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది. ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరఫున, టీడీపీ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అంటూ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.