అయోధ్యలో ప్రధాని మెగా రోడ్ షో
అయోధ్య: శ్రీరామజన్మభూమి స్థలంలో నిర్మిస్తున్న రామాలయం ఓపెనింగ్కు ముందే.. అయోధ్యలో ప్రధాని మోడీ ఈరోజు రోడ్ షో నిర్వహించారు. విమానంలో అక్కడకు చేరుకున్న ఆయన తన కాన్వాయ్లో అయోధ్య నగరంలో రోడ్ షో నిర్వహించారు. నగర ప్రజలు ఆయనకు వెల్కమ్ చెప్పారు. ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. 15 కిలోమీటర్ల దూరం ఆయన రోడ్షో చేపట్టారు. రీడెవలప్ చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను కూడా ఆయన ప్రారంభించనున్నారు.