17 నెలలుగా పేదలకు ఎందుకు ఇవ్వలేదు?

21 లక్షల ఇళ్లను గత టిడిపి ప్రభుత్వం మంజూరు చేసింది

devineni uma
devineni uma

అమరావతి: సిఎం జగన్‌ అధికారలోకి రాకముందు ఎన్నో హామీలు గుప్పించి ఇప్పుడు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్ల మంజూరు విషయంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ’21 లక్షల ఇళ్లను తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరుచేసి 10 లక్షలకు పైగా పూర్తిచేస్తే, 17 నెలలుగా పేదలకు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికలముందు పూర్తిగా ఉచితంగా ఇస్తామని, బ్యాంకులోను సహా పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన మీమాటలకు నేడు ఏం సమాధానం చెబుతారు? అధికారంలోకి వచ్చాక ఎంతమంది పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు ఇచ్చారు?’ అని దేవినేని ఉమ ప్రభుత్వాని ప్రశ్నించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/