నేటితో ముగియనున్న కేసీఆర్ ‘రాజశ్యామల యాగం’

తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన ‘రాజశ్యామల యాగం’ నేటితో ముగియనుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ యాగం..బుధువారం మొదలు అవ్వగా..నేటి తో పూర్తి అవుతుంది. నిన్న రెండో రోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరీ దేవి అవతారంలో దరశం ఇచ్చారు. యాగంలో మొత్తం మూడు లక్షలకు మించి రాజశ్యామల మూల మంత్రాలను హవనం చేసారు. అలాగే 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ ఉంది. సర్వ లోక సంరక్షణార్ధం ఇంద్ర సూక్త హోమం, నవగ్రహ సూక్త హోమం నిర్వహిస్తారు.

షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం కూడా నిర్వ్హయించారు. పండితులు పఠిస్తున్న వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. ఈ యాగం నేటితో సంపూర్ణం కానుంది. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో యాగం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల 10 నిమిషాలకు పూర్ణాహుతికి ముహూర్తం నిర్ణయించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, ఇతరులు క్రతువుల్లో పాల్గొంటారు. పూర్ణాహుతితో రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం సంపూర్ణం అవుతుంది. యాగంలో మూడు లక్షలకు పైగా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలను హవనం చేస్తున్నారు. యాగంలో తెలంగాణతో పాటు తమిళనాడు, ఏపీ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది ఉద్ధండులైన పండితులు పాల్గొంటున్నారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ యజుర్వేద పండితులు ఘనస్వస్తి పలికారు.