నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

cm-jagan

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం మొదలు కానుంది. ఈ సందర్బంగా పలు కీలక అంశాలకు ఆమోదం తెలుపనుంది ఏపీ కేబినెట్‌. సుమారు రూ.19 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో తాజా పరిణామాలతో పాటుగా సామాజిక సాధికార బస్సుయాత్రపై చర్చ జరగనుంది. అంతేకాదు ఇటీవల విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితాపై అవగాహన కల్పించేందుకు, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టే దిశగా అవగాహన కూడా కల్పించాలని భావిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.