మంత్రులు, అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష

హైదరాబాద్: సిఎం కెసిఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్, రాష్ట్ర అవతరణ వేడుకలు, ఖరీఫ్ సాగుపై సమీక్ష జరుపుతున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్లో కరోనా తీవ్రత, నివారణ చర్యలపై కూడా చర్చించనున్నారు. అయితే రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో మినహాయింపులు ఇస్తారా? లాక్ డౌన్ కొనసాగిస్తారా? సిఎం కెసిఆర్ నిర్ణయంపై ఆసక్తి కనిపిస్తుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/