సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తున్న చైనా

భారీగా బలగాలను మోహరిస్తున్న భారత్

India- China

న్యూఢిల్లీ: భారత్‌ చైనా మధ్య సరిహద్దు వివాదం ముదురుతుంది. సరిహద్దుల్లో చైనా అలజడిని రేపింది. ఓ వైపు నేపాల్ ను ఎగదోస్తూ, మరోవైపు సరిహద్దులో సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ద అవసరాలకు తగ్గట్టుగా రోజుల వ్యవధిలోనే సరిహద్దుకు సమీపంలో ఉన్న ఓ ఎయిర్ బేస్ ను విస్తరించింది. ఈ నేపథ్యంలో, చైనాకు బుద్ది చెప్పేందుకు భారత్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది. సరిహద్దుల వెంబడి భద్రతా బలగాలను మోహరించింది. సున్నిత ప్రదేశాల్లో అదనపు బలగాలను కూడా మోహరింపజేసింది. మరిన్ని బలగాలను సరిహద్దులకు పంపుతోంది. చైనాతో సరిహద్దు సమస్య ముదురుతున్న సమయంలో… ఇండియన్ ఆర్మీ కమాండర్లతో ఆర్మీ చీఫ్ నరవాణే భేటీ అయ్యారు. పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోడి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/