మరికాసేపట్లో దీక్ష మొదలుపెట్టబోతున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది. ఇప్పటికే ఈ దీక్ష కు పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ దీక్షలో 500 మంది కూర్చోనున్నారు. కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ఈ పార్టీల ప్రతినిధులు కవిత దీక్షలో కూర్చునున్నారు. అంతేకాదు దేశంలోని వివిధ మహిళా హక్కుల సంఘాలు కూడా కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంలకు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్షను ముగించనున్నారు.