కడప లో పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కడప జిల్లాలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు నడుస్తున్నాయి. సోమవారం చెన్నముక్కపల్లి విడిది కేంద్రంలో కమలాపురం నియోజకవర్గం తప్పెట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ గడికోట శాంతి, ఆమె భర్త సుధాకర్ రెడ్డి, గండిరెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచులు గాలి ప్రసాద్ రెడ్డి, దర్శన్ రెడ్డి, మిట్టపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, గోనుమాకపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, అంబవరం మాజీ ఎంపీటీసీ ముంతా జానయ్య, సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, నాగేంద్ర రెడ్డి, దళిత నేతలు కొప్పుల జగన్, అనిల్, చంటితో పాటు పలువురు దళిత యువకులు లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

అలాగే కమలాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు కూడా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. మిట్టపల్లికి చెందిన 20 కుటుంబాలు, గంగిరెడ్డిపల్లికి చెందిన 30 కుటుంబాలు, గోనుమాకులపల్లికి చెందిన 30 కుటుంబాలు, అలిదిన, పాయసంపల్లి, పడదుర్తి, చడిపిరాళ్లకు చెందిన ఎస్సీలు, ఎస్ఆర్ నగర్, జేబీ నగర్ కాలనీ, ఉప్పరపల్లికి చెందిన 40 కుటుంబాలు, తోలగంగనపల్లికి చెందిన 8 కుటుంబాల వారు టీడీపీ పార్టీ లోకి చేరారు. వారంతా పార్టీ లోకి రావడం పట్ల లోకేష్ సంతోషం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో కమలాపురంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాక్షస పాలనను అంతమొందిస్తేనే కడపజిల్లా వాసులకు స్వేచ్ఛ కలుగుతుందని తెలిపారు.