అమరావతిలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్న సిఎం జగన్

jagan-to-lay-foundation-stone-for-houses-in-amaravati

అమరావతిః మరో భారీ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతిలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో ఈ రోజు భూమి పూజను నిర్వహించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్ లలో 50,793 మందికి మే 26న ఇళ్ల పట్టాలను అందించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఈ భూమిలో ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలను చేపట్టబోతున్నారు.