23 న తెలంగాణ పర్యటన రానున్న అమిత్ షా

ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా

amit-shah

హైదరాబాద్‌ః 23 న తెలంగాణ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయింది. ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.30 గంటలకు విమానాశ్రయం సమీపంలోని నొవోటెల్ వెళ్తారు. ఆస్కార్ అవార్డు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తో 4 గంటల నుంచి 4.30 వరకు తేనీటి విందులో పాల్గొంటారు. 4.30 నుంచి 5.10 గంటల వరకు బిజెపి కోర్ కమిటీతో సమావేశమవుతారు. అనంతరం 5.15 గంలకు చేవెళ్ల సభకు బయల్దేరుతారు. చేవెళ్ల సభలో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పాల్గొంటారు. రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.