మూడో రోజు ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

cbi-grills-mp-avinash-reddy-for-third-day

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మూడో రోజు సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు మూడో రోజు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రేపు విచారణకు రావాలో, వద్దో అన్నదానిపై శుక్రవారం రాత్రికి అవినాశ్ రెడ్డికి తెలియజేయనున్నారు. అలాగే ఇదే కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ కాసేపట్లో ముగియనుంది. అవినాష్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిందితులతో జరిపిన లావాదేవీలపై అవినాష్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి తనను కూడా అరెస్ట్ చేస్తారనే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి ఈ నెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అలాగే 25 వరకు సీబీఐ పిలిస్తే విచారణకు వెళ్లాలని చెప్పింది. ఈ కారణంగా మూడు రోజులుగా ఆయన విచారణకు హాజరవుతున్నారు. మరోపక్క, హైకోర్టు ఆదేశాలపై నేడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.